Monday, May 13, 2024
- Advertisement -

టాప్ డైరెక్ట‌ర్లు ఎందుకు క‌లిశారో తెలుసా?

- Advertisement -

తెలుగు ఇండ‌స్ట్రీకి చెందిన టాప్ డైరెక్ట‌ర్లు అంద‌రూ క‌లిసి ఓ చోట క‌నిపించారు.సినిమా ఫంక్ష‌న్లో మాత్ర‌మే క‌నిపించే మ‌న ద‌ర్శ‌కులు,ఈసారి మాత్రం ఓ స్పెష‌ల్ పార్టీలో ద‌ర్శ‌కులంద‌రు క‌లిసి సంద‌డి చేశారు. దర్శకుడు వంశీ పైడిపల్లి సోమవారం సాయంత్రం తన ఇంటికి అగ్ర దర్శకులందరినీ ఆహ్వానించి ప్రత్యేకంగా పార్టీను ఏర్పాటు చేశాడు. రాజమౌళి, సుకుమార్, కొరటాల శివ, క్రిష్, హరీష్ శంకర్, నాగ్అశ్విన్, సందీప్ రెడ్డి వంగ, అనీల్ రావిపూడి వంటి దర్శకులు ఈ పార్టీకు హాజరయ్యి సందడి చేశారు.

వీరంద‌రు క‌లిసి తీసుకున్న ఫోటోను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశాడు వంశీ పైడిపల్లి. ఈ సాయంత్రాన్ని గుర్తుండిపోయేలా చేసిన ద‌ర్శ‌కుల‌కు త‌న ధన్యవాదాలు తెలిపాడు వంశీ.మహేష్ బాబు 25వ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు వంశీ.ఈ సినిమా షూటింగ్ త్వ‌ర‌లోనే మొద‌లు కానుంది.అయితే వంశీ పైడిపల్లి ఈ పార్టీ ఎందుకు ఇచ్చాడో మాత్రం తెలియాల్సి ఉంది.

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -