Tuesday, May 14, 2024
- Advertisement -

ముందు చిరంజీవిగారే.. తర్వాత కళ్యాణ్ బాబాయ్ : వరణ్ తేజ్

- Advertisement -

సాధారణంగా నా మూవీ అంటే.. డాడీయో.. బాబాయో.. బన్నీ అన్నో.. చరణ్ అన్నో వస్తారు. కానీ ఈ సారి ఎవ్వరూ రాకుండా.. కేవలం మా సినిమా యూనిట్ స్టేజ్ మీద ఉండాలని అనుకున్నాం. కానీ వారెవ్వరూ రాకపోయినప్పటికి.. మీరందరూ వచ్చినందుకు థ్యాంక్స్.. అంటూ ఫ్యాన్స్ ని పొగిడేశాడు వరణ్ తేజ్. అయితే ఓకేసారి వరణ్ కొంచెం డిఫరెంట్ గా మాట్లాడుతుండటంతో.. ”ఫిదా” ఆడియో ఫంక్షన్ వచ్చిన ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. సడన్ గా వరుణ్ ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అనుకున్నారు. మనోడు కూడా ఏదన్న ‘చెప్పను బ్రదర్’ తరహాలో పేలుస్తాడా అని ఖంగారుపడ్డారు. కాని అలాగేం జరగలేదులే. ఈ రోజు మేమందరం ఈ స్థాయిలో ఉన్నాం అంటే అది కేవలం చిరంజీవి గారి వలనే. కళ్యాణ్ బాబాయ్ సినిమాల్లోకి రాకముందే.. మేము చిరంజీవి గారిని చూసి సినిమాలపట్ల ఆకర్షితులయ్యాం. ముందు చిరంజీవిగారే. తరువాతే కళ్యాణ్ బాబాయ్” అంటూ మెగా హీరో వరుణ్ తేజ్ కూడా చిరుకోటి చదివేశాడు. ఆ విధంగా స్టేజ్ క్రిందన అరుస్తున్న ఫ్యాన్స్ అందరికీ ఏదన్నా మెసేజ్ ఇచ్చాడు. అందుకు కారణం కూడా చెప్పాడు. ”నేనెప్పుడూ మా పెదనాన్న.. బాబాయ్.. చరణ్ అన్న గురించి మాట్లాడటం.. చాలామందికి నచ్చదేమో.. కాని ఈరోజు నేనిక్కడ ఉన్నానంటే వారే కారణం కాబట్టి.. ఖచ్చితంగా మాట్లాడుతాను” అన్నాడు వరుణ్ తేజ్. అయితే ఈ మూవీలో హీరోయిన్ ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అనగానే హర్టయ్యాడట. ”సార్.. (శేఖర్ కమ్ముల).. నేను హర్టయ్యాను. ఉంటే నేను కదా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయ్యుండాలి.. హీరోయిన్ ఉండటమేంటి? అని అడిగేశాను. కాని పల్లవి రోల్ బాగా చేసింది. బాబాయ్ డైలాగులు కూడా కొన్ని భలే చెప్పింది” అంటున్నాడు వరుణ్ తేజ్. 200% అద్భుతంగా చేశావ్ అంటూ సాయిపల్లవిని పొగిడేశాడు. ఇక శేఖర్ కమ్ముల డైరక్షన్లో చేయడం బ్లెస్సింగ్ అన్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -