ప్రస్తుతం ఓటీటీయుగం నడుస్తోంది. వెబ్సిరీస్ల హవా కొనసాగుతోంది. కరోనా లాక్డౌన్తో థియేటర్లు మూతపడటం ఓటీటీకి కలిసివచ్చింది. అయితే బాలీవుడ్లో ఇప్పటికే పలువురు నటులు వెబ్ సిరీస్లో నటించి మెప్పించారు. కానీ తెలుగులో అగ్రహీరోలు ఇప్పటివరకు వెబ్ సీరిస్లో నటించేందుకు ఒప్పుకోలేదు. మంచి కథ సిద్ధమైతే వెబ్సీరిస్లో నటించేందుకు సిద్ధమేనని అక్కినేని నాగార్జున ప్రకటించాడు. ఇప్పటికే ఆయన పలు కథలు కూడా విన్నాడు.
ఇదిలా ఉంటే తాను ఓ వెబ్సిరిస్లో నటించబోతున్నట్టు వెంకటేశ్ సంచలన ప్రకటన చేశాడు. రానా దగ్గుపాటితో కలిసి వెబ్సిరిస్ లో నటించబోతున్నట్టు చెప్పాడు. ఈ వెబ్సిరిస్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానున్నట్టు సమాచారం. ప్రయోగాలు చేసేందుకు వెంకటేశ్ ఎప్పుడూ ముందుంటాడు. ప్రస్తుతం కమర్షియల్ ఫార్ములా సినిమాలు పెద్దగా ఆడటం లేదు. ఆడియన్స్ అభిరుచుల్లో మార్పురావడమే అందుకు కారణం.
Also Read: ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. రాధే శ్యామ్ తాజా అప్డేట్ ఏమిటంటే ..!
హీరోలంతా విభిన్న కథాంశాల్లోనే నటిస్తున్నారు. ఇక వెంకటేశ్ కూడా వెబ్సీరిస్లో నటించాలని భావిస్తున్నారు. రాబోయేది ఓటీటీ యుగం కావడంతో అందుకు తగ్గట్టుగా వెంకటేశ్ కూడా తన సినిమాలు ఎంచుకుంటున్నాడు. ఇప్పటికే వెంకటేశ్ హీరోగా నటించిన నారప్ప రేపు ఓటీటీలో విడుదల కాబోతున్నది. ఒకవేళ వెంకటేశ్ చేయబోయే వెబ్సీరిస్ సక్సెస్ అయితే మరికొందరు అగ్ర నటులు సైతం ఇటువైపుకు వచ్చే చాన్స్ ఉంది.
Also Read: ‘అలవైకుంఠపురములో ’ హిందీ రీమేక్లో అల్లు అర్జున్ గెస్ట్ రోల్..!