‘పెళ్లి చూపులు‘, ‘అర్జున్ రెడ్డి’ సినిమాల కన్నా ముందే విజయ్ దేవరకొండ ఒక సినిమా కమిటయ్యాడు. ఏవేవో కారణాలతో ఆ సినిమా వాయిదా పడుతూ వస్తోంది. సినిమా షూటింగ్ పూర్తయినా విడుదలకు నోచుకోలేదు. ఈలోపు విజయ్ దేవరకొండ ‘పెళ్లి చూపులు‘, ‘అర్జున్ రెడ్డి’ సినిమాలతో బంపర్ హిట్లు కొట్టాడు. ఇప్పుడు విజయ్ క్రేజీ అమాంతం పెరిగిపోవడంతో ఆ సినిమాను ఇప్పుడు ఐదేళ్ల తర్వాత విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరిగాయి. ఇప్పుడు మొత్తం పనులు పూర్తయి మార్చి 9వ తేదీన విడుదల కానుంది.
విజయ్ దేవరకొండ ఐదేళ్ల కిందట ‘ఏ మంత్రం వేసావే’ అనే సినిమా షూటింగ్లో పాల్గొన్నాడు. మర్రి విజయ్ దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమాను గోలీసోడా ఫిలిమ్స్ బ్యానర్లో రూపొందింది. ఈ సినిమా థియేటర్ల బంద్ విరమణ తర్వాత విడుదలవుతుండడంతో ఏ సినిమాలు లేవు. ఈ సమయంలో అత్యధిక థియేటర్లలో ఈ సినిమా ఆడించాలని సినిమా బృందం చూస్తోంది. ఈ సినిమాపై అంచనాలైతే పెద్దగా లేవు. చివరికి విజయ్ దేవరకొండ కూడా ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయడం లేదు.
ఈ సినిమాను సుమారు 650 థియేటర్లలో విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. ఈ భారీ స్థాయి విడుదలతో డిస్ట్రిబ్యూటర్లు ఓపెనింగ్స్ రూపంలోనే పెట్టుబడిలో ఎక్కువ మొత్తాన్ని వెనక్కు రాబట్టుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
https://www.youtube.com/watch?v=EeNbZb1gWp0