ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రాష్ట్ర రాజకీయాల్ని తిరగరాసిన డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రను ‘యాత్ర’ పేరుతో సినిమాగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. వైఎస్ఆర్ పాత్రలో మమ్ముట్టి నటిస్తున్నారు. మహి వి.రాఘవ దర్శకత్వంలో 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నసంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ డేట్కూడా వచ్చేసింది.
ఇప్పటికే కొంతవరకూ చిత్రీకరణను పూర్తి చేశారు. ఈ సినిమాలో జగన్ పాత్రలో ఏ హీరో నటించనున్నాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గతంలో జగన్ పాత్రలో సూర్య గానీ .. కార్తీ గాని కనిపించవచ్చనే టాక్ వచ్చిన సంగతి తెలిసిందే.
అయితే ఇప్పుడు వారు కాకుండా తెలుగు స్టార్ ముద్దుల హీరో తాజాగా తెరపైకి వచ్చారు. జగన్ పాత్రలో విజయ్ దేవరకొండ నటిస్తున్నారనే వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. తెలుగులో ఇప్పుడు యూత్ లో విజయ్ దేవరకొండకి విపరీతమైన క్రేజ్ వుంది. రాజకీయాల నేపథ్యంలో ఆయన చేస్తోన్న ‘నోటా’ పట్ల కూడా అంతా ఎంతో ఆసక్తిని చూపుతున్నారు.
జగన్ పాత్రకు విజయ్ దేవరకొండను తీసుకోవడం మంచిదనే ఉద్దేశంతో సంప్రదింపులు మొదలైనట్టుగా తెలుస్తోంది. వై ఎస్ జగన్ పాత్రకి విజయ్ దేవరకొండ కరెక్టుగా సెట్ అవుతాడనే బలమైన నమ్మకం కూడా ఉండటంతో, ఆయనను ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా సమాచారం. విజయ్ దేవరకొండ ఒప్పుకుంటే సినిమాకు మరింత క్రేజ్ రానుంది. యాత్ర’ చిత్రాన్ని వైఎస్ఆర్ తనయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.