Tuesday, May 14, 2024
- Advertisement -

రష్మిక కోసం రిపోర్టర్ తో గొడవ పడిన విజయ్?

- Advertisement -

విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్న కలిసి గీత గోవిందం అనే సూపర్ హిట్ చిత్రం లో నటించారు ఇంతకు ముందు. ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో మన అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ సినిమా మాములుగా వంద కోట్లు దాటేయడం తో నే విజయ్ కి రష్మిక కి స్టార్ డం పెరిగిపోయింది. ఇప్పుడు రష్మిక తన పారితోషికం కూడా పెంచేసింది. ఇకపోతే రష్మిక ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో పాటు డియర్ కామ్రేడ్ సినిమా ప్రమోషన్స్ లో బిజీ గా గడుపుతుంది.ఇద్దరూ కలిసి సినిమా మ్యూజిక్ ఫెస్టివల్స్ లో భాగంగా ఇటీవలే చెన్నై, బెంగళూరు, కొచ్చి నగరాలకు వెళ్లిన విషయం తెలిసిందే.

అయితే బెంగళూరు లో ఒక కార్యక్రమం లో పాల్గొంటూ ఉండగా ఒక రిపోర్టర్ రష్మిక ని తన ఎంగేజ్మెంట్ బ్రేకప్ గురించి అడుగగా దానికి విజయ్ తన కోపం ప్రదర్శించాడు. “అసలు ఆ అమ్మాయి ఎవరితో ఎంగేజ్మెంట్ చేసుకుంటే ఏంటి, ఎవరితో బ్రేకప్ చేసుకుంటే ఏంటి. అదంతా మనకెందుకు” అని రిపోర్టర్ కి కౌంటర్ ఇచ్చాడట విజయ్.

రష్మిక 2016 లో రక్షిత్ శెట్టి అనే కన్నడ హీరో తో ఎంగేజ్మెంట్ చేసుకొని లాస్ట్ ఇయర్ దాన్ని కాన్సిల్ చేసుకుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -