Monday, May 27, 2024
- Advertisement -

500 కోట్లతో విజయ్…100 కోట్లతో బాలయ్య

- Advertisement -

దసరా బాక్సాఫీస్‌ వార్‌లో విజేతలుగా నిలిచారు ఇళయ దళపతి విజయ్, బాలయ్య బాబు. దసరాకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్‌ ముందు సత్తాచాటాయి. ఇక విజయ్‌ పాన్ ఇండియా చిత్రం ఇప్పటికే రూ.500 కోట్ల క్లబ్‌లో చేరగా నందమూరి బాలయ్య భగవంత్ కేసరి రూ.100 కోట్లు రాబట్టింది.

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం భగవంత్ కేసరి. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 104 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం లో శ్రీ లీల, అర్జున్ రాంపాల్ లు కీలక పాత్రల్లో నటించారు.

లోకేష్ కనగరాజు దర్శకత్వంలో విజయ్ హీరోగా తెరకెక్కిన చిత్రం లియో. ఇప్పటి వరకూ ఈ సినిమా 506.4 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. త్రిష హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం లో సంజయ్ దత్, అర్జున్, ప్రియా ఆనంద్, గౌతమ్ మీనన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -