Monday, May 13, 2024
- Advertisement -

మీ కోసమే ఈ నిర్ణయం..రాములమ్మ సంచలనం!

- Advertisement -

లేడి అమితాబ్‌గా వెండి తెరను ఏలిన హీరోయిన్లలో ఒకరు విజయశాంతి. హీరోలకు సమానంగా క్రేజ్ సంపాదించుకున్న రాములమ్మ..తర్వాత రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగారు. బీఆర్ఎస్ నుండి మెదక్ ఎంపీగా గెలిచిన రాములమ్మ ఆ తర్వాత ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేకపోయింది. బీఆర్ఎస్‌తో విభేదించి కాంగ్రెస్‌లో ఆ తర్వాత బీజేపీలో చేరారు. సరిగ్గా 2023 ఎన్నికలకు ముందు తిరిగి కాంగ్రెస్‌లో చేరారు.

ఇక రాజకీయాల్లో ఉంటూ సినిమాలకు దూరమయ్యారు విజయశాంతి. రీసెంట్‌గా మహేష్‌తో సరిలేరు నీకెవ్వరులో కీలక పాత్రలో నటించారు. అయితే తాజాగా అభిమానుల కోసం మళ్లీ ఓ సినిమాకు సంతకం చేశానని వెల్లడించారు. నన్ను ప్రాణంగా భావిస్తూ జన్మంతా ఎన్నడూ నా వెంట ఉన్న అభిమాన దైవాల కృతజ్ఞత ఎన్నటికి తీర్చుకోలేదని అందుకే ఓ సినిమా చేస్తున్నానిన తెలిపారు. 1979 నుండి ఐదు దశాబ్దాల సినీ గమనంలో మీ దీవెనలు వెన్నంటి ఉంటాయని ఆశిస్తున్నాను అని పేర్కొన్నారు.

హీరో కళ్యాణ్ రామ్ మూవీలో నటిస్తోండగా దర్శకులు, నిర్మాతలకు థ్యాంక్స్ చెప్పారు. వాస్తవానికి కాంగ్రెస్‌లో చేరగానే ఆమెకు మెదక్ ఎంపీ సీటు ఖాయమని ప్రచారం జరిగింది. అయితే ఇంతలోనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -