Thursday, April 25, 2024
- Advertisement -

రోజా ని మంత్రి గా చూడాలనుకున్న రాములమ్మ

- Advertisement -

ఈ సారి ఎన్నికల్లో నిలబడకపోయినా కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేసి ప్రత్యర్థులపై బాగా నే పోటీ ఇచ్చారు మాజీ పార్లమెంట్ సభ్యురాలు, సినీ నటి విజయ శాంతి. రాజకీయాల్లో ఎప్పుడూ క్రియాశీలకం గా ఉండే ఆమె ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర కాబినెట్ కూర్పు పై కామెంట్ చేశారు. సినిమాల నుండి రాజకీయాల్లో కి వచ్చిన రోజా కి కూడా జగన్ తన కాబినెట్ లోకి తీసుకుంటే మంచిది ఆమె అభిప్రాయపడ్డారు.

“జగన్మోహన్ రెడ్డి గారు తన మంత్రివర్గంలో మహిళలకు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు హోంశాఖను కేటాయించడం మీద జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కనీసం దీనిని చూసిన తర్వాత అయినా కేసీఆర్ గారు మహిళలకు తన మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారా? సినీ రంగానికి చెందిన ఎమ్మెల్యే రోజా కూడా జగన్ తన మంత్రివర్గంలో స్థానం కల్పించి ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. సినీ రంగం నుంచి రాజకీయాలలోకి వచ్చిన వారిని కేవలం ప్రచారానికే పరిమితం చేయకుండా వారి సేవలు వినియోగించుకుని, వారికి కూడా తగిన గుర్తింపు ఇస్తే బాగుంటుందని నేను చెప్పదలుచుకున్నాను. రాబోయే రోజుల్లో నైనా జగన్ గారు రోజా విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను…” అని విజయశాంతి తెలిపారు.

అయితే తాజా సమాచారం మేరకు ఇప్పుడు రోజా ఏపీఐఐసీ చైర్ పర్సన్‌గా చేయబోతున్నారు అని తెలుస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -