Monday, April 29, 2024
- Advertisement -

ఈ సారి ఫ్రీమేక్ ని నమ్ముకుంటున్న విక్రమ్

- Advertisement -

తమిళం లో కడరం కొండం అనే సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా ని తెలుగు లో కి కూడా డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నారు. మిస్టర్. కేకే అనే టైటిల్ తో తెలుగు లో విడుదల కానున్న ఈ చిత్రానికి దర్శకుడు రాజేష్ సెల్వం. తెలుగు లో చీకటి రాజ్యం అనే సినిమా తో తెర కి పరిచయం అయినా దర్శకుడి రెండో చిత్రం ఇది. చియాన్ విక్రమ్, మరియు అక్షర హాసన్ జంటగా కలిసి నటిస్తున్న ఈ చిత్రం గత ఏడాది నవంబర్ లో షూటింగ్ ప్రారంభించుకుంది. కమల్ హాసన్ ఈ సినిమా ని తన రాజ్ కమల్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ సంస్థ పై నిర్మిస్తున్నారు.

అయితే ఈ సినిమా కి సంబందించిన థియాట్రికల్ ట్రైలర్ ని ఈ రోజు తమిళం లో, తెలుగు లో ఒకేసారి విడుదల చేశారు. ట్రైలర్ లో అద్భుతమైన విజువల్స్ ని రూపుదిద్దారు ఛాయాగ్రాహకులు. కేవలం విజువల్స్ తో నే సినిమా కి ఒక ఆసక్తికర లుక్ ని తెచ్చే ప్రయత్నం చేశారు. ఇక తెలుగు డబ్బింగ్ పర్వాలేదనిపిస్తున్నా ఇదొక మంచి యాక్షన్ సినిమా అయేలా కనిపిస్తుంది. 2011 లో విడుదల అయినా పాయింట్ బ్లాంక్ అనే సినిమా కి ఇది ఫ్రీమేక్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -