మహేష్బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘భరత్ అనే నేను’ ఎప్పుడా? అని ఎదురుచూస్తున్న ఫస్ట్లుక్ టీజర్ ఈ రోజు సాయంత్రం 6గంటలకు విడుదల చేయనున్నారని చిత్ర యూనిట్ అఫిషియల్ ట్విటర్ ఆకౌంట్ ద్వారా ప్రకటించారు.మహేష్బాబు- కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన ‘శ్రీమంతుడు’ బ్లాక్ బాష్టర్గా నిలిచింది.ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా రావడంతో సినిమాపై అంచనాలు చాలా ఎక్కువుగా ఉన్నాయి.
చదువు విషయంలో ఒత్తిళ్లు తట్టుకోలేక విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఓ సీఎంగా మహేశ్ ఏం చేశాడు అన్న కోణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం.ఈ చిత్రంలో దేశంలో విద్యా వ్యవస్థ ఎలా ఉంది అన్న విషయాన్ని ప్రధానంగా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో మహేశ్కి జోడీగా బాలీవుడ్ నటి కైరా అడ్వాణీ నటిస్తోంది.
