Monday, May 6, 2024
- Advertisement -

కెప్టెన్సీ టాస్క్‌లో కౌశ‌ల్‌తో గొడవ‌ప‌డ్డ పూజా

- Advertisement -

బిగ్‌బాస్ రెండో సీజ‌న్ 75 ఎపిసోడ్లు పూర్తి చేస‌కుంది.ఇంకా మిగిలింది 25 రోజులే కావడం షోలో చాలామంది కంటెస్టెంట్స్ ఉండ‌టంతో ఈ వారం ఇద్ద‌రు ఎలిమినేట్ అవుతార‌ని అంద‌రు భావిస్తున్నారు.ఇక బిగ్‌బాస్ హౌస్‌లో నిన్న‌టి వ‌ర‌కు పెళ్లి టాస్క్ న‌డించింది.ఈ పెళ్లి టాస్క్ ముగియాగానే నివేవ‌రో సినిమా హీరో,హీరోయిన్లు ఆది పినిశెట్టి,తాప్సీ,రితిక‌ సింగ్‌లు బిగ్‌బాస్ హౌస్‌లో సంద‌డి చేశారు.ఇక ఈ రోజు(శుక్ర‌వారం)కెప్టెన్సీ టాస్క్ జ‌ర‌గనుంది.ఈ వారం కెప్టెన్ అవ్వడానికి కౌశల్, దీప్తి , యాంకర్ శ్యామల, అమిత్ లు కూడా కెప్టెన్సీ టాస్క్ లో పోటీ చేయాలనుకుంటున్నారు.

తాజాగా ఈ టాస్క్ కి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు బిగ్‌బాస్ టీం.ఈసారి కెప్టెన్సీ టాస్క్ కోసం హౌస్ మేట్స్ అందరిలో ఎవరు ముందుగా వెళ్లి కన్ఫెషన్ రూమ్ లో ఉన్న కుర్చీపై కూర్చుంటారో వారు ఈవారం కెప్టెన్సీ కోసం పోటీ పడొచ్చని సూచించారు.దీంతో హౌస్ మేట్స్ అంతా ఒక్కసారిగా కన్ఫెషన్ రూమ్ లోకి వెళ్లడంతో తోపులాట జరిగింది. ముందుగా దీప్తి, కౌశల్, సామ్రాట్ వెళ్లి కుర్చీలో కూర్చోగా వారిపై పూజా రామచంద్రన్ కూర్చొని తనే ముందుగా వచ్చానని వాదనపెట్టుకుంది.మ‌రి చూడాలి ఈ వారం కెప్టెన్ ఎవ‌రు అవుతారో.

https://www.facebook.com/maatv/videos/1100067140162819/

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -