Sunday, May 5, 2024
- Advertisement -

బాల‌య్య ఎందుకు రాలేదు?

- Advertisement -

ఎమ్మెల్యే బాల‌కృష్ణ నిన్న(మంగ‌ళ‌వారం) జ‌రిగిన ఇండ‌స్ట్రీ స‌మావేశానికి రాలేద‌నే సంగ‌తి అంద‌రికి తెలిసందే. తాజాగా ఇండ‌స్ట్రీలో జ‌రుగుతున్న ప‌రిణమాల‌పై జ‌రిగిన స‌మావేశానికి బాల‌య్య రాక‌పోవ‌డంపై మిశ్ర‌మ స్పంద‌న‌లు వినిపిస్తున్నాయి. బాలకృష్ణ రాక‌పోవ‌డంపై పొరపాటు చేసాడు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.అగ్ర హీరోలు అంద‌రు వ‌చ్చిన ఈ స‌మావేశానికి బాల‌కృష్ణ మాత్రం రాలేదు. కాస్టింగ్ కౌచ్ గురించి ప్ర‌ధానంగా ఈ స‌మావేశం జ‌రిగింది.ఈ వివాదాంలోకి హీరో జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ లాగ‌డంతో ఈ స‌మ‌స్య పెద్ద‌దిగా మారింది.కో-అర్డినేట‌ర్లు ఆర్టిస్ట్‌ల‌ను లైంగికంగా వేధిస్తురన్న ఆరోప‌ణ‌ల గురించి కూడా ప్ర‌ధానంగా చ‌ర్చించినట్లు స‌మాచారం.

మ‌రి ఇటువంటి స‌మావేశానికి బాల‌కృష్ణ రాక‌పోవ‌డంపై చాలానే అంశాలు ఉన్నాయి.ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో కమ్మ – కాపు సామాజిక వర్గాలకు సంబంధించిన వర్గపోరు అంతర్లీనంగా కొనసాగుతూ ఉన్నా ఎక్కడా ఆ విషయాలను ఓపెన్ కాకుండా టాప్ హీరోలు అంతా తమ స్ట్రాటజీలను కొనసాగిస్తూ ఇండస్ట్రీలో వర్గాలు కులాలు లేవు అన్న విషయాన్ని జాగ్రత్తగా మేనేజ్ చేస్తూ వస్తున్నారు.పైగా ఈ సమావేశం ముఖ్యంగా చిరంజీవి నిర్వ‌హిండం పైగా ఇది అంతా ప‌వ‌న్ క‌ల్యాణ్ గురించి కావ‌డంతో ఈ స‌మావేశానికి బాల‌య్య దూరంగా ఉన్నార‌ని స‌మాచారం.పైగా పొలిటిక‌ల్‌గా కూడా బాలయ్య‌కు ప‌వ‌న్‌కు మ‌ధ్య గ్యాప్ పెరిగింది.దీనివ‌ల్ల కూడా బాల‌య్య ఈ స‌మావేశానికి రాలేద‌ని తెలుస్తుంది.ఏదీఏమైనా నిన్నటి సమావేశానికి దూరంగా ఉండి బాలయ్య పొరపాటు చేసాడు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -