ప్రస్తుతం చారిత్రక, పురాణేతిహాస, జానపద చిత్రాల వైపుకు దర్శకులు, నిర్మాతలు మొగ్గుచూపుతున్నారు. ఇటువంటి చిత్రాలకు పాన్ఇండియా స్థాయిలో మార్కెట్ ఉండటమే అందుకు కారణం.. చారిత్రక కథతో తెరకెక్కిన బాహుబలి పాన్ ఇండియా లెవెల్లో భారీ కలెక్షన్లు రాబట్టిన విషయం తెలిసిందే. దీంతో ఈ చిత్రానికి కథను అందించిన విజయేంద్రప్రసాద్, దర్శకుడు రాజమౌళికి దేశవ్యాప్తంగా మార్కెట్ ఏర్పడింది. బాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని భాషల నిర్మాతలు విజయేంద్ర ప్రసాద్ను కథ కోసం సంప్రదిస్తున్నారు.
విజయేంద్ర ప్రసాద్ కథ అందించిన ‘బాహుబలి’, ‘భజరంగి భాయిజాన్’, ‘మణికర్ణిక’ భారీ కలెక్షన్లు రాబట్టిన విషయం తెలిసిందే. అయితే విజయేంద్రప్రసాద్ ఇప్పుడు బాలీవుడ్లో ఓ భారీ ప్రాజెక్టుకు కథను అందిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు అలౌకిక్ దేశాయ్ సీత కోణంలో రామాయణాన్ని తెరకెక్కించాలని భావించారు. ఇందుకోసం విజయేంద్రప్రసాద్ కథను సిద్ధం చేస్తున్నారు. అయితే ఈ చిత్రంలో సీత పాత్ర కోసం దర్శకుడు వెదుకుతున్నాడు. తొలుత అలియాభట్ను తీసుకుందామని భావించారు. ఆ తర్వాత కరీనా కపూర్ను ఆ స్థానానికి ఫిక్స్ అయ్యారు. ఈ మేరకు వార్తలు వచ్చాయి. అయితే కరీనా కపూర్ను సీతగా అస్సలు అంగీకరించబోమని ఓ వర్గం గట్టిగా పట్టుబడుతున్నది.
Also Read: బాలీవుడ్ను ఆదుకొనేది అక్షయేనా?
ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకొని .. ముస్లింగా మారిపోయిన కరీనాను సీతగా పెడితే ఈ చిత్రాన్ని అడ్డుకుంటామని హిందూ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీంతో నిర్మాతలకు చిక్కు వచ్చి పడింది. ప్రభాస్ హీరోగా.. రామాయణం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో రావణాసురిడిగా సైఫ్ అలీఖాన్ చేస్తున్నాడు. అయితే ప్రస్తుతం ఆయన భార్యను సీతగా ఎంపిక చేయబోతుంటే మాత్రం విమర్శలు వస్తున్నాయి. ఈ వివాదం ఎక్కడి వరకు వెళుతుందో వేచి చూడాలి. దర్శక నిర్మాతలు సీతగా కరీనానే ఫిక్స్ అవుతారా? లేక మరోనటిని సంప్రదిస్తారా? అన్న విషయం వేచి చూడాలి.
Also Read: కమల్ను ఇండియన్ -2 శనిలా వెంటాడుతోంది?