త్వరలో తమిళనాడు రాజకీయాల్లోకి.. రజినీకాంత్ రాబోతున్నరంటూ వార్తల క్రమంలో.. ఇప్పుడు ముఖ్యమంత్రి వైఫ్ తో ఆయన సమావేశం కావడం వెనక ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. రజనీకాంత్.. సీఎం వైఫ్ ని కలవడానికి కారణం ఏంటి..? వీరిద్దరి మీటింగ్ వెనక ఏం జరిగింది..? ఈ విధంగా పలు రకల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
{loadmodule mod_custom,GA1}
పూర్తి విషయంలోకి వెళ్తే.. మహారాష్ర్ట సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత. ఇప్పటికీ ఆమె మరాఠా, బాలీవుడ్ సినిమాల్లో పాటలు కూడా పాడుతున్నారు. ఇటీవలే.. ‘కాలా’ షూటింగ్ టైంలో.. రజినీ కాంత్ తో సమావేశమయ్యారు అమృత. అందులో ఓ పాట కోసం అమృత భేటీ అయ్యారంటూ ఓ రెంజ్ లో ప్రచారం జరుగుతోంది. ఈ విషయం అమృత వరకు వెళ్లడంతో.. అమె ట్విట్టర్ ద్వారా.. ఈ విధంగా స్పందించింది. రజినీకాంత్తో కలిసి దిగిన ఫోటోలను ట్విట్టర్ ద్వారా అభిమానులతో షేర్ చేసి.. రజనీతో గొప్ప మీటింగ్ జరిగిందని, సామాజిక ఆందోళనలు, వాటి పరిష్కారాల గురించి చర్చించినట్టు రాసుకొచ్చారు. అతనితో కలిసి ఉన్న ఆ కొంత టైం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని.. ట్విట్టర్ ద్వారా తెలిపింది.
{loadmodule mod_custom,GA2}
మొత్తానికి తన పై వస్తున్న రూమర్స్ కు అమృత ఈ విధంగా ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఒకప్పుడు బ్యాంక్ ఉద్యోగిగావున్న అమృత, 2005లో దేవేంద్ర ఫడ్నవీస్ని పెళ్లి చేసుకుంది. ఇప్పటికి ఆ ఉద్యోగం కంటిన్యూ చేస్తూనేవున్నారు. సమయం ఉన్నప్పుడల్లా.. సినిమాల్లో సాంగ్స్ కూడా పాడుతూ ఉన్నారు. సో అమృత రజినీని కలవడం వెనక అసలు సంగతి ఇది.
{youtube}R1lahEAp7ig{/youtube}
{loadmodule mod_sp_social,Follow Us}
Related