టీడీపీ మాజీ ఎంపీ ,నటుడు నందమూరి హరికృష్ణ బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే.హరికృష్ణ మరణంతో నందమూరి కుటుంబ సభ్యులు, అభిమానులు కన్నీరుమున్నీరు అయ్యారు. హరికృష్ణ మృతి పట్ల తెలుగు ఇండస్ట్రీ మొత్తం ఆయన ఫ్యామిలీకి తమ ప్రగాఢ సానుభుతి తెలిపారు.టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం హరికృష్ణని చివరి చూపు చూసుకుని ఎంతగానో బాధ పడ్డారు.నాగర్జున,వెంకటేష్,చిరంజీవి,అల్లు అర్జున్,రామ్ చరణ్ ఇలా అందరు హరికృష్ణ ఇంటికి వెళ్లి ఎన్టీఆర్,కల్యాణ్ రామ్లకు ధైర్యం చెప్పారు.కాని మహేశ్ బాబు మాత్రం హరికృష్ణ మృతిపై కేవలం ట్వీట్టర్లో స్పందించారు. ఎన్టీఆర్ , మహేశ్ల మధ్య మంచి స్నేహ బంధం ఉన్న సంగతి తెలిసిందే.మహేశ్ నటించిన భరత్ అను నేను సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా వచ్చాడు ఎన్టీఆర్.
ఆ తరువాత వీరిద్దరు రెండు ఈవెంట్స్లో కలిసి కనిపించారు కూడా. మరి తన స్నేహితుడు తండ్రి చనిపోతే కేవలం ట్వీట్టర్లో స్పందించడం ఏంటీ అని కొందరు ప్రశ్నిస్తున్నారు.మహేశ్ హైదరాబాద్లోనే ఉండి రాకపోవడంపై ఆయనపై విమర్శల దాడి ఎక్కువైంది.శుక్రవారం మహిళ దర్శకురాలు బి.జయ మరణించిన వెంటనే ఆమె భౌతికకాయానికి నివాళులు ఆర్పించాడు మహేశ్.అదేవిధాంగా తన స్నేహితుడు అయిన ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ చనిపోతే ఎందుకు రాలేదని ఆయన అభిమానులు మహేశ్ను ప్రశ్నిస్తున్నారు.మరి దీనిపై మహేశ్ అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.