- Advertisement -
మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ ఖాతా పేరు మార్చుకున్నారు. తన పేరును తీసేయడంతో ఒక్కసారిగా అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు. చిరంజీవికి బదులు ఆచార్యగా తన ట్విట్టర్ ఖాతా పేరు మార్చారు. తన తదుపరి సినిమా ప్రమోషన్స్లో భాగంగానే చిరు ఇలా చేశారని అంటున్నారు.
2020లో చిరంజీవి ట్విట్టర్లో అడుగు పెట్టారు. అప్పటి నుంచి తన తదుపరి సినిమా అప్డేట్స్, నటీనటులతో సరదా సంభాషణలు నిర్వహించారు. కొరటాల శివ కాంబోలో వస్తున్న చిత్రం ‘ఆచార్య’ ఎప్పుడెప్పుడా అని చిరు అభిమానులు ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.
చిరుతో పాటు రామ్చరణ్ ఒకే స్క్రీన్ పై కనిపిస్తుండటం అభిమానులకు ఇక పండుగే. తాజాగా చిరు తన ట్విట్టర్ ఖాతా పేరు మార్చడంతో అభిమానులు మరింత ఖుషీ అయ్యారు.