బిగ్బాస్ రెండో సీజన్లో మరో ఎలిమినేషన్ నిన్న(ఆదివారం) జరిగిన ఎపిసోడ్లో జరిగింది.బిగ్బాస్ హౌస్ను వదిలి పూజా రామచంద్రన్ బయటికి వచ్చేసింది.వైల్డ్కార్డు ద్వారా బిగ్బిస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చింది పూజా.ఆమె వచ్చి మూడు వారాలే అయినప్పటికి రెండు సార్లు ఎలిమినేషన్కు నామినేట్ అయింది.ఇక ఆమె వచ్చిన మొదటి వారం బాబుగారు ఎలిమినేట్ అవ్వగా ,రెండో వారం దీప్తి సునైనా బయటికి వచ్చేసింది.ఇక ఈ వారం ఎలిమినేషన్లో పూజాతో పాటు దీప్తి,కౌశల్,తనీష్లు ఎలిమినేషన్కు నామినేట్ అయ్యారు.కౌశల్,తనీష్లకు బయట ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్తో ఎక్కువ ఓట్లు వేయించుకున్నారు.
ఇక మిగిలింది పూజా,దీప్తిలు,వీరిద్దరిలో ఎవరో ఒకరు హౌస్ను వదిలి బయటికి వస్తారని చాలామంది ముందే ఊహించారు.ఇక పూజానే బయటికి రావడనికి గల కారణాలు కూడా కొన్ని ఉన్నాయి.పూజా రామచంద్రన్కు తెలుగు రాదు ,ఇది ఆమెకు పెద్ద మైనస్గా చెప్పవచ్చు.ఆమె తెలుగు ప్రజలకు పెద్దగా తెలియకపోవడం,హౌస్లో పెద్దగా రిజిస్టార్ కాకపోవడంతోనే పూజా బిగ్బాస్ నుంచి బయటికి వచ్చేసిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.కాని పూజా టాస్క్స్,గేమ్స్లో కాని చాలా హూషారుగా పార్టిసిపెట్ చేస్తుంది.తానను తాను నిరుపించుకునే లోపే బిగ్బాస్ నుంచి బయటికి వచ్చేసింది పూజా.