Monday, April 29, 2024
- Advertisement -

ఇంటర్వ్యూ లో కన్నీరు పెట్టిన సమంత.. కారణం అదే !

- Advertisement -

టాలీవుడ్ ఇండస్ట్రీలో సమంత తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఒక్క ప్రభాస్ మినహా దాదాపుగా అందరూ టాలీవుడ్ స్టార్ హీరోలతో నటించిన సమంత, తమిళ్ హిందీ కూడా మూవీస్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక తన మొదటి సినిమా ఏమాయ చేశావే మూవీలో అక్కినేని నాగ చైతన్య తో కలిసి నటించిన శ్యామ్.. ఆ తరువాత నాగచైతన్యతో కలిసి పలు హిట్ మూవీస్ లో నటించింది. ఇక మొదటి సినిమా నుంచే ఇద్దరి మద్య ప్రేమ చిగురించడంతో.. వారిద్దరి ప్రేమను పెద్దలు కూడా అంగీకరించడంతో 2017 లో వివాహం చేసుకున్నారు. .

టాలీవుడ్ బెస్ట్ లవ్ పెయిర్ గా ఉన్న నాగచైతన్య సమంత జంట.. ఏమైందో తెలియదు గాని గత ఏడాది విడాకులు తీసుకున్నారు. ఇక ఆ తరువాత నుంచి ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటూ వచ్చారు. చైతు నుంచి దూరం అయిన తరువాత సమంత కొన్నాళ్లు అధ్యాత్మికంగా కూడా గడుపుతూ తిరిగి తన ప్రొఫెషన్ లో బిజీ అయింది. ఇక ప్రస్తుతం సమంత ” యశోధ “, శకుంతలం ” అనే రెండు లేడి ఓరియెంటెడ్ మూవీస్ చేస్తోంది. ఇక తాజాగా రిలీజ్ అయిన ” యశోధ ” ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇక ఇటీవల సుమా చేసిన ఓ ఇంటర్వ్యూ లో సమంత కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది.

” జీవితంలో మంచి రోజులు చెడ్డ రోజులు రెండు ఉంటాయని, వాటన్నిటిని తట్టుకొని నిలబడ్డానని, సమంత చెప్పుకొచ్చింది. ఆ రోజులను తలచుకుంటే బాదేస్తుందంటూ శ్యామ్ కన్నీరు పెట్టుకుంది. అయితే సమంత మొదటి సారి ఓ ఇంటర్వ్యూ లో కన్నీరు పెట్టుకోవడం చూసిన ఆమె అభిమానులు శ్యామ్ కు దైర్యంగా నిలుస్తున్నారు. నీకేం కాదని ఆమెకు భరోసా ఇస్తున్నారు. ఇక ఇటీవల సమంత ఒక అంతుచిక్కని ప్రాణాంతక వ్యాధితో ఇబ్బంది పడిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం తను బాగానే ఉన్నానని సమంత చెప్పుకొచ్చింది. అయితే సమంత కన్నీరు పెట్టుకోవడానికి మరొక రీజన్ కూడా ఉందని, ఆమెను నాగచైతన్య విడాకులు తీసుకోవడం చాలా భాదించిందని, అందుకే ఆ రోజులను తలచుకుంటూ శ్యామ్ కన్నీరు మున్నీరు అయిందని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

రాజమౌళి చేతుల్లోకి ” ఆది పురుష్ “.. నిజమేనా ?

సుకుమార్ తో మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్.. హీరో ఎవరో మరి !

విజయ్ క్రేజ్ ఏమాత్రం తగ్గలే.. రెండు భారీ ప్రాజెక్టులు !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -