Tuesday, April 30, 2024
- Advertisement -

రాజమౌళి చేతుల్లోకి ” ఆది పురుష్ “.. నిజమేనా ?

- Advertisement -

నేషనల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఆది పురుష్ , సలార్, ప్రాజెక్ట్ కే.. వంటి చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. వాటిలో ఆది పురుష్ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కావల్సివుంది. అయితే ఆ మద్య రిలీజ్ అయిన టీజర్ తో మూవీపై ఉన్న అంచనాలన్నీ తారుమారయ్యాయి. టీజర్ లోని గ్రాఫిక్స్ చాలా పూర్ గా ఉందని కార్టూన్ మూవీ లాగా తీశారని మూవీ యూనిట్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. కామన్ ఆడియన్స్ మాత్రమే కాకుండా ప్రభాస్ ఫ్యాన్స్ కూడా మూవీ టీజర్ ను జీర్ణించుకోలేకపోయారు. దాంతో చిత్రయూనిట్ గ్రాఫిక్స్ పై మళ్ళీ వర్క్ చేసేందుకు సిద్దమైందట. త్రీడి మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ తో తెరకెక్కుతున్న ఈ మూవీకి బడ్జెట్ ఇప్పటికే 500 కోట్ల దాకా ఖర్చు అయినట్లు సమాచారం. .

ఇక ప్రస్తుతం విమర్శల కారణంగా గ్రాఫిక్స్ లోని లోపాలను సరిదిద్దెందుకు మళ్ళీ అదనంగా 150 కోట్ల దాకా ఖర్చు కానుందట. దాంతో గ్రాఫిక్స్ వర్క్ కోసం ఈ మూవీను సంక్రాంతి నుంచి జూన్ 16 కు పోస్ట్ పోన్ చేశారు. కాగా ఈ సారి మూవీకి సంబంధించిన గ్రాఫిక్స్ అంతా కూడా దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి పర్యవేక్షణలో జరగనున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం. రాజమౌళి గ్రాఫిక్స్ పై ఎంత శ్రద్ద వహిస్తారో అందరికీ తెలిసిందే. జక్కన్న మూవీస్ లో గ్రాఫిక్స్ సహజత్వానికి దగ్గరగా ఉంటుంది. అందుకే ప్రభాస్ కోరిక వెరకు ” ఆది పురుష్ ” గ్రాఫిక్స్ వర్క్ ను పర్యవేక్షించేందుకు రాజమౌళి ఒప్పుకున్నాడట. మరి ఈ వార్తలల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు గాని ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్ లో మాత్రం బాగా వైరల్ అవుతుంది. ఒకవేళ ఈ వార్తలు నిజమైతే జక్కన్న విజన్ లో ఆది పురుష్ సంచలనలు క్రియేట్ చేయడం ఖాయం.

ఇవి కూడా చదవండి

చిరుకి ఆ మూవీపై నమ్మకం లేదా.. అందుకే వెనక్కి ?

సుకుమార్ తో మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్.. హీరో ఎవరో మరి !

మహేష్ తో పోటీ.. ఆ పాన్ ఇండియా మూవీ నిలబడగలదా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -