సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో పని చేసే నటీనటుల విషయంలో కొన్ని సార్లు విరామం ఏర్పడుతుంది. అయితే ఈ విరామం కావాలని ఎవరు తీసుకోరు. దానంతట అదే వస్తుంది.ఈ క్రమంలోనే కొందరు సెలబ్రెటీలు తెలుగులో నటించాలని కోరికతో ఉన్న వారికి అవకాశాలు రావడం లేదు. అయితే ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాల తరహాలో కొందరికి అవకాశాలు వస్తున్నప్పటికీ మరికొందరికి మాత్రం తెలుగు సినిమాలు వారికే అవకాశాలు ఇస్తున్నాయి. మరి 90 లలో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించిన నటీనటులు తాజాగా మరోసారి తెలుగు తెరపై సందడి చేయనున్నారు. మరి ఆ నటులు ఎవరు? ఆ సినిమాలు ఏమిటో? ఇక్కడ తెలుసుకుందాం ..
త్రిమూర్తులు అనే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటుడు అనుపమ్ ఖేర్. భారతీయ భాషలతో పాటు ఇంగ్లీష్ చైనీస్ వంటి భాషల్లో సుమారు ఐదు వందల చిత్రాలకు పైగా నటించిన అనుపమ్ తాజాగా కార్తికేయ 2 చిత్రం ద్వారా ప్రేక్షకులను అలరించనున్నారు. అదేవిధంగా భాష ఏదైనా తన హావభావాలతో అందరినీ ఆకట్టుకున్న నటి నందితా దాస్. 2006 లో ‘కమ్లి’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నందిత విరాటపర్వం ద్వారా మరోసారి సందడి చేయనున్నారు.
Also read:టాలీవుడ్ లో నెంబర్ 1 హీరో విజయ దేవరకొండనట!
చంద్రలేఖ సినిమా ద్వారా ప్రేక్షకులను అలరించిన బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఆ తర్వాత డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించారు. తాజాగా సంజయ్ దత్ ‘కేజీయఫ్ ఛాప్టర్ 2’ ద్వారా టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకులను అలరించనున్నారు. అక్కినేని నాగేశ్వరరావు వినోద్ కుమార్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన రథసారథి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రవీనా టాండన్ మరోసారి కేజిఎఫ్ చాప్టర్ 2 ద్వారా ప్రేక్షకులను సందడి చేయనున్నారు.
Also read:ఫ్యామిలీ మ్యాన్ 2లో అందరిని ఉడికించిన అద్భుత పాత్రలివే!