ఈ మద్య దేశంలో కొంత మంది మృగాళ్లు కామంతో రెచ్చిపోతున్నారు. టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది దేశం అభివృద్ది ఎంత జరుగుతుంతో తెలియదు కానీ.. సెల్ ఫోన్ వచ్చినప్పటి నుంచి ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు వచ్చినప్పటి నుంచి యువకుల్లో పైశాచికత్వం పెరిగిపోతూ వస్తుంది. ఆడవారు కనిపిస్తే చాలు మృగాళ్లలా రెచ్చిపోతున్నారు. దరిద్రం ఏంటంటే మైనర్లు కూడా కామంతో ఊగిపోయే దారుణ స్థితి నెలకొంది.
తాజాగా ఓ మూడేళ్ల బాలికపై పన్నెండేళ్ల బాలుడు లైంగిక దాడికి పాల్పడ్డ ఘటన జార్ఖండ్లోని తూర్పు సింగ్భం జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకివచ్చింది. జిల్లాలోని పర్సుఢి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న లోకో కాలనీలో బాధిత చిన్నారి కుటుంబం కిరాయికి ఉంటున్నది. ఆ బాలిక ఒంటరిగా ఆడుకుంటున్న సమయంలో పక్కింటి కుర్రాడు ఆ బాలికను తన ఇంట్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు.
ఈ మేరకు బాధితురాలి తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం బాలుడు అతని తండ్రి పరారీలో ఉన్నారు. కాగా, ఆ బాలుడు, అతని తండ్రిపై కేసు నమోదు చేశామని వెల్లడించారు.
ఛీ.. వీడు మనిషేనా.. కుక్కపై అత్యాచారం!
బాబోయ్ పక్షి పొట్ట చీల్చుకొని బయటకు వచ్చి చేప.. అయినా..