కామా తురానాం.. న భయం న లజ్జ.. అంటారు. ఈ మద్య కొంత మంది కామాంధులు ఆడవారిపై ఏ రేంజ్ లో రెచ్చిపోతున్నారో అందరికీ తెలిసిందే. చిన్నవయసు అని కూడా చూడకుండా అత్యాచారాలకు పాల్పపడుతూ హత్యలకు పాల్పపడుతున్నారు. దేశంలో ఇలా ప్రతినిత్యం ఎక్కడో అక్కడ ఆడవారిపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే కొంత మంది సమాజం సిగ్గుతో తలదించే నీచపు పనులు చేస్తున్నారు.
ఆ మద్య ఓ కామాంధుడు ఓ దూడపై అత్యాచారానికి పాల్పపడిన విషయం తెలిసిందే. తాజాగా మరో కామాంధుడు ఆడ కుక్కపై అత్యాచారం చేశాడు. ఈ ఘటన ముంబయిలోని పొవారి ప్రాంతంలో జరిగింది. శోభనాథ్ సరోజ్ అనే యువకుడు కుక్కను ఓ సెల్లార్లోని ఓ గదిలోకి తీసుకెళ్లాడు. అక్కడ కుక్క మూతిని తాడుతో కట్టేసి అత్యాచారం చేశాడు.
ఆ తర్వాత ఆ దుర్మార్గుడు అక్కడ నుంచి పారిపోయాడు. తీవ్ర రక్త స్రావం కావడంతో మూలుగుతున్న కుక్కను గమనించిన సెక్యూరిటీ గార్డులు దాన్ని జంతు సంరక్షణ ప్రతినిధులకు అప్పగించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. చికిత్స నిమిత్తం కుక్కను పశువైద్యశాలకు తరలించారు. సిసిటివి పుటేజీల ఆధారంగా నిందితుడిని గుర్తించి శోభనాథ్ సరోజ్ ను అరెస్టు చేశారు.
బాబోయ్ పక్షి పొట్ట చీల్చుకొని బయటకు వచ్చి చేప.. అయినా..
ఒడిశా అడవుల్లో అరుదైన నల్లపులి..!