- Advertisement -
గత ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు తెలంగాణలో బీజేపీ పుంజుకుంటుందన్న విషయం ఇటీవల జరిగిన దుబ్బాక ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికలు తెలుపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ మద్య పోటీ నెలకొంది. అయితే వచ్చే ఎన్నికల్లో తమ సత్తా చాటుకునేందుకు బీజేపీ గట్టి కృషి చేస్తుంది.
తాజాగా ఖమ్మం జిల్లా వైరా మండల కేంద్రంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు నేలవెళ్లి రామారావుపై గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో దాడి చేశారు. హత్య జరిగిన వెంటనే ఆయనను ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించారు.
అయితే పరిస్థితి విషమించడంతో కొద్ది సేపటి క్రితం ఆయన మృతి చెందాడు. కాగా, ఈ హత్య ఆర్థిక లావాదేవీలే కారణమా.. మరి ఏదయినా కారణం ఉందా ? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. హత్య చేసిన వ్యక్తీ రాజేష్ అని గుర్తించారు పోలీసులు.