Friday, April 19, 2024
- Advertisement -

చలసాని శ్రీనివాస్‌ కుమార్తె ఆత్మహత్య .. కారణం అదేనా?

- Advertisement -

ఆంధ్ర మేధావుల సంఘం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌ కూతురు శిరీష్మ ఆత్మహత్యకు పాల్పడ్డారు. గతంలో ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని చలసాని పెద్ద ఎత్తున పోరాటం చేశారు. తెలుగు రాష్ట్రాల విభజన సమయంలో కూడా ఉయన పేరు మారుమోగింది. తాాజగా చలసాని కుమార్తె శిరీష్మ ఆత్మహత్యకు పాల్పపడటం సంచలనం రేపుతుంది. రాయదుర్గం పోలీసు స్టేషన్‌ పరిధిలో బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది.

ఇంటీరియర్‌ డిజైనర్‌గా పనిచేస్తున్న శిరిష్మకు ఓయూ కాలనీలోని ట్రయల్‌ విల్లాస్‌లో నివసించే గ్రానైట్‌ వ్యాపారి సిద్ధార్థ్‌తో 2016 డిసెంబర్‌లో వివాహమైంది. ప్రస్తుతం వారిద్దరు గచ్చిబౌలిలోని ఐకియా స్టోర్‌ సమీపంలోని ప్లాట్‌ 906–డిలో నివాసం ఉంటున్నారు. అయితే పెళ్లయినా ఇప్పటి వరకు ఈ జంటకు సంతానం కలగలేదు.. దాంతో కొంత కాలంగా శిరీష్మ డిప్రేషన్ లో ఉంటున్నట్టు సమచారం.

ఈ నేపథ్యంలోనే  శిరీష్మ ఆత్మహత్యకు పాల్పడ్డం కుటుంబసభ్యుల్ని ఒక్కసారిగా షాక్ కు గురిచేసింది. శిరీష్మ డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఉదయాన్నే నిమ్మరసం తాగితే.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఇంగ్లాండ్​ ఆల్​రౌండర్ కి..చెన్నై సూపర్ కింగ్స్ బలే రేటు..!

మ్యాక్స్​వెల్ కి భారీ రేటు..బెంగుళూరు జోరు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -