నిమ్మకాయలలో ఔషధ గుణాలు చాలానే ఉన్నాయని ఇప్పటికే పలు పరిశోధనల్లో వెల్లడైంది. కాలంతో సంబంధం లేకుండా నిమ్మరసం తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని వైద్య నిపుణులు సైతం పేర్కొంటున్నారు. మరీ ముఖ్యంగా ఉదయం లేవగానే నిర్మరసం తాగటం వల్ల అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆ లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..!
నిమ్మకాయలో సీ విటమిన్ అధికంగా ఉంటుంది. దీని వల్ల శరీరంలో నిరోధక శక్తి పెరుగుతుంది. నిమ్మకాయలో ఉండే యాంటీసెప్టిక్ గుణాలు వ్యాధులను దరిచేరనీయవు. వయస్సు పైబడుతున్నప్పటికీ.. త్వరగా చర్మం ముడతలు పడకుండా సహాయం పడుతుంది. పొరపాటున కలుషితమైన నీరు తాగి అనారోగ్యానికి గురైతే..నిమ్మరసం తాగటం వల్ల త్వరగా ఉపశమనం లభిస్తుంది.
అలాగే, బరువు తగ్గాలనుకునే వారు ప్రతిరోజూ ఉదయం నిమ్మరసం తాగితే మంచి ఫలితం ఉంటుంది. చిగుళ్ల నుంచి వచ్చే రక్తస్రావాన్నితగ్గించడంతో పాటు పంటి నొప్పిని దూరం చేయడంలో నిమ్మరసం కీలకంగా ఉంటుంది. ముత్రం పోసేప్పుడు మంట పుట్టడం, కిడ్నీలలో రాళ్లు రానీయకుండా చేయడం… ఒక వేళ ఉంటే వాటిని కరిగించడంలో నిమ్మరసం మంచి ఫలితాలు చూపిస్తుంది. ఇన్ని ప్రయోజనాలున్న నిమ్మరసాన్ని అందుబాటులో ఉంటే ఉదయం లేవగానే తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఈ రుచి మాములుగా ఉండదు.. క్యూ కట్టాల్సిందే!
గాల్లో ఎగిరే దోశలు.. మీరు చూశారా?