దేశంలో కరోనా కష్టాలకు తోడుగా రోడ్డు ప్రమాదాల సంఖ్య కూడా పెరిగిపోతున్నాయి. ఓ వైపు లాక్ డౌన్ అంటున్నా.. ప్రయాణాల్లో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్దాపురం ఏడీబీ రహదారి పారిశ్రామిక ప్రాంతం వద్ద లారీ కారును ఢీకొట్టింది.
ఈ ఘటనలో ఐదు నెలల చిన్నారి సహా నలుగురు దుర్మరణం చెందారు. మరోకరికి తీవ్రగాయాలు అయ్యాయి. చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. . తాళ్లరేవు మండలం పెద్దవలస నుంచి రాజమండ్రి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు.
మృతదేహాలను పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. అతివేగం వల్లనే ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందని స్థానికులు పేర్కొంటున్నారు.
నేటి పంచాంగం,గురువారం (13-05-2021)
మీ సేవలు అసామాన్యం.. అందుకే నా సెల్యూట్ : మహేష్ బాబు