తెలంగాణలో లాక్డౌన్ ఎత్తేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం సడలింపులతో లాక్డౌన్ అమల్లో ఉన్న విషయం తెలిసిందే. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం ఐదుగంటల వరకు లాక్డౌన్ సడలింపులు కొనసాగుతున్నాయి. సాయంత్రం మరో గంటపాటు అంటే ఆరు గంటల వరకు ఇళ్లకు చేరుకొనేందుకు వెసులుబాటు కల్పించారు.
రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుతున్నది. ప్రతిరోజు 1000 నుంచి 1500 కేసులు మాత్రమే వస్తున్నాయని వైద్య ఆరోగ్యశాఖ అంటున్నది. ఈ క్రమంలో లాక్డౌన్ పూర్తిస్థాయిలో ఎత్తేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. మరోవైపు దేశవ్యాప్తంగా థర్డ్వేవ్ పై భయాందోళనలు నెలకొన్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాలు హెచ్చరికలు జారీచేశాయి. అయితే తెలంగాణలో మాత్రం లాక్డౌన్ ఎత్తివేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం.
Also Read: థర్డ్వేవ్.. చిన్నపిల్లల తల్లిదండ్రులూ బీకేర్ఫుల్..!
ఈ నెల 20 వరకు లాక్డౌన్ అమల్లో ఉంది. అయితే ఈ లోపే క్యాబినెట్ సమావేశమై లాక్డౌన్ ఎత్తివేసే విషయంలో నిర్ణయం తీసుకోబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 96.13 శాతం, మరణాల రేటు 0.57 శాతం ఉన్నట్టు వైద్య అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో లాక్డౌన్పై తుది నిర్ణయం తీసుకొనేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది.
సీఎం కేసీఆర్ లాక్డౌన్ ఎత్తివేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. లాక్డౌన్ విధించడంతో రాష్ట్రంలో వ్యాపారాలు దెబ్బతిన్నాయి. చిరు వ్యాపారులు రోడ్డున పడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వానికి సైతం ఆదాయం రావడం లేదు. దీంతో ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని లాక్డౌన్ ఎత్తివేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం.
Also Read : ఏపీలో కర్ఫ్యూ పొడిగింపు.. మరిన్ని సడలింపులు..!