దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకీ తీవ్ర తరం అవుతూనే ఉన్నాయి. ఎక్కడ చూసినా రోడ్లు రక్తసిక్తం అవుతున్నాయి. ప్రభుత్వాలు రోడ్డు భద్రత గురించి ఎంతగా చెప్పినా కొంతమంది నిర్లక్ష్యం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బీద్-పర్లీ హైవేపై ఓ ట్రక్కు భీభత్సం సృష్టించింది. అత్యంత వేగవంతంగా వచ్చిన ట్రక్కు ఆటో, బైకు, మరో వాహనాన్ని ఢీకొట్టింది.
ఈ దారుణ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే కన్నుమూశారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయాల పాలయ్యారు. ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఓ ఆటో మద్వానీ నుంచి బీడ్ వైపు వెళ్తున్నది. ఈ క్రమంలో వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు.. ఆటోను ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా మోటార్ సైకిల్ను మరో ఫోర్ వీలర్ని ఢీ కొట్టడంతో ఈ దారుణం జరిగింది.
ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు కూడా కన్నుమూశారు. క్షతగాత్రుల్లో ఐదుగురు ఆటలో ప్రయాణిస్తున్నవారుకాగా, ఇద్దరు ఫోర్ వీలర్, బైక్పై వెళ్తున్న వ్యక్తి గాయపడ్డారు. దీంతో వారిని బీడ్, ఔరంగాబాద్ దవాఖానలకు తరలించారు. కాగా, ప్రమాదానికి కారణమైన ట్రక్కు డ్రైవర్ పరారయ్యాడని పోలీసులు తెలిపారు.
కేసిఆర్ కి వాళ్ళ పట్ల గౌరవం ఎక్కువ. !