- Advertisement -
బాలీవుడ్ దిగ్గజ నటుడు మిథున్ చక్రవర్తి.. బిజెపీ లో చేరారు. కోల్కతా బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం కోసం ఏర్పాటు చేసిన భారీ ర్యాలీ వేదికగా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు మిథున్. బెంగాల్ బిజేపీ నేతలు ఆయనకు కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు.
బెంగాల్ శాసన సభకు 8 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మిథున్ చక్రవర్తి బిజేపి లో చేరడం ప్రాధాన్యం సంతరించుకుంది.అంతకుముందు.. బిజేపి ప్రధాన కార్యదర్శి, పార్టీ తరఫున బెంగాల్ ఎన్నికల పరిశీలకులు కైలాశ్ విజయ్ వర్గీయ.. మిథున్ చక్రవర్తిని శనివారం కలిశారు. ఈ విషయాన్ని వెల్లడించారు.
చంద్ర బాబు రోడ్ షో.. ఎలా సాగింది అంటే..!
ఢిల్లీలో మాట్లాడటానికి భయపడి ఇక్కడ అరుస్తున్నారు: పవన్ కళ్యాణ్