బ్రాహ్మణులు, గురువుల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్కు అపార గౌరవం ఉందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. ఆలయాల పేర్లను కొత్త జిల్లాలకు పెట్టారని తెలిపారు. హైదరాబాద్లో బ్రాహ్మణ సంఘాలతో సమావేశమైన మంత్రి కేటీఆర్ వారి సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు.
పేద బ్రాహ్మణుల కోసం బ్రాహ్మణ పరిషత్ ఏర్పాటు చేశామని, అర్చకుల సమస్యలను పరిష్కరిస్తున్నామని కేటీఆర్ వెల్లడించారు. భాజపా అభ్యర్థి రాంచందర్ రావుకు అవకాశం ఇచ్చినా ఏమీ చేయలేదని తెరాస అభ్యర్థి వాణిదేవికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. వాణీదేవి లక్షమంది పట్టభద్రులను తయారు చేశారన్న కేటీఆర్..
ఆమె గెలుపు ఖరారైందని ధీమా వ్యక్తం చేశారు.ఐటీఐఆర్ ఇవ్వకుండా రాష్ట్ర యువత నోట్లో కేంద్రం మట్టికొట్టిందని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజురోజుకూ పెట్రో, గ్యాస్ ధరలు పెంచుతూ సామాన్యుడిపై భారం పెడుతోందని అన్నారు. కేంద్రం అన్ని విధాలుగా రాష్ట్రంపై శీతకన్ను వేసిందన్న మంత్రి.. బ్రాహ్మణుల సమస్యలపై త్వరలోనే సమావేశం నిర్వహిస్తామని చెప్పారు.
బిజేపి లోకి మరో సినిమా స్టార్.. ఏ రాష్ట్రం అంటే..!
చంద్ర బాబు రోడ్ షో.. ఎలా సాగింది అంటే..!
ఢిల్లీలో మాట్లాడటానికి భయపడి ఇక్కడ అరుస్తున్నారు: పవన్ కళ్యాణ్