Friday, April 26, 2024
- Advertisement -

మెట్రోస్టేష‌న్ పై నుంచి దూకి వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య‌..

- Advertisement -

మెట్రో స్టేషన్ పైనుంచి కిందకు దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్‌లోని అమీర్‌పేట్ మైత్రీవనంలో చోటు చేసుకుంది. మెట్రోస్టేషన్ మొదటి అంతస్తు నుంచి గుర్తు తెలియని వ్యక్తి దూకాడు. తీవ్రంగా గాయపడిన అతడు అక్కడిక్కడే మృతి చెందాడు.అత‌ని వివ‌రాలు తెలియ‌క పోవ‌డంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని శవాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

గత మంగళవారం కొత్తపేట విక్టోరియా మెమోరియల్‌ మెట్రో స్టేషన్‌లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. కుటుంబ కలహాలతో విసుగు చెందిన ఓ మహిళ స్టేషన్ పైనుంచి కిందకు దూకి ఆత్మహత్యకు యత్నించింది. అయితే స్వల్ప గాయాలతో ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఇంకో సారి ఇలాంటి సంగ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా మెట్రో అధికారులు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.మెట్రో స్టేషన్‌లలో ఇలాంటి ఘటనలు జరుగుతుండటం అధికారులను కలవరపెడుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -