మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం వావిలాల శివారు బోటిమీది తండాలోని ఆర్ఎంపీ వైద్యుడు సంతోష్ ఇల్లు అబార్షన్లకు అడ్డాగా మారింది. గతంలో మహబూబాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కంపౌండర్గా పని చేసేవాడు. ఆ ఆసుపత్రిలో ఓ లేడీ నర్సు పరిచయమైంది. ఇక వీరిద్దరు కలిసి గుట్టుచప్పుడు కాకుండా అబార్షన్లకు తెరలేపారు. ఆడవారి బలహీనతను క్యాష్ చేసుకుంటూ ఇష్టానుసారంగా భ్రూణ హత్యలకు పాల్పపడుతున్నారు.
డబ్బుల ఆశతో భ్రూణ హత్యలకు ఒడిగడుతున్నారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూడటంతో పోలీసులు వావిలాల సమీపంలోని బోటిమీది తండాకు చేరుకుని విచారణ చేపట్టారు. వీరిద్దరు చేస్తున్న దందా గురించి ఆసుపత్రిలో తెలియడంతో తీసివేశారు. కొన్ని రోజుల క్రితం రాత్రివేళ ఓ మహిళను కారులో తీసుకొచ్చి సంతోష్ ఇంట్లో అబార్షన్ చేశారు.
అబార్షన్ చేస్తున్న దృశ్యాలు స్థానికంగా సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఈ విషయాన్ని చైల్డ్లైన్ సిబ్బంది… కలెక్టర్ దృష్టికి తీసుకుపోవడంతో కఠిన చర్యలకు ఆదేశించారు. పోలీసులు ఆరుగురిపై కేసు నమోదు చేసి నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తెలుస్తోంది. ధనార్జనే ధ్యేయంగా అబార్షన్ దందాలకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు.
దూకుడు పెంచిన వైఎస్ షర్మిల.. ఈరోజు ఏకంగా మహానగరంలో భేటి..!