Friday, April 26, 2024
- Advertisement -

ఉత్తరప్రదేశ్‌లో దారుణం.. వృద్దురాలిపై మానవ మృగాళ్ల అకృత్యాం!

- Advertisement -

దేశంలో రోజు రోజుకీ మహిళలపై దారుణాలు జరుగుతున్నాయి. వృద్దులు, చిన్నారులు అని కూడా చూడకుండా కామాంధులు రెచ్చిపోతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన జరిగింది.  బదౌన్‌ జిల్లాలో 50ఏళ్ల మహిళ అంత్యంత దారుణంగా మానవ మృగాలు రెచ్చిపోయారు. దేవాలయానికని వెళ్లిన ఓ మహిళపై కొంతమంది కామాంధులు సామూహిక అత్యాచారం చేయడమే కాకుండా ఆమెను చిత్రవధ చేశారు. ఆమె పక్కటెముకలు విరిచేశారు. రెండు కాళ్లు విరగొట్టారు. అంతకంటే దారుణాతి దారుణంగా ఆమె ప్రైవేటు అవయవాలను దారుణంగా గాయపరిచారు. 

ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. బదౌన్‌ జిల్లాలోని ఉగైతీ ప్రాంతంలో అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తున్న 50ఏళ్ల మహిళ ఆదివారం సాయంత్రం ఆ ప్రాంతంలో ఉండే ఓ దేవాలయానికి వెళ్లింది. గుడికి వెళ్లిన ఆమె ఎంతకీ రాకపోవడంతో ఆలయ పూజారి మరో ఇద్దరు కలిసి తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న మహిళను ఇంటికి తీసుకొచ్చినట్లు ఆమె కొడుకు చెప్పాడు. తీవ్ర గాయాలతో ఉన్న ఆమెను ఆసుపత్రికి తరలించేలోపు కన్నుమూసింది.

అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహానికి పోస్ట్‌మార్టం జరిపించారు. పోస్టుమార్టంలో దారుణమైన విషయాలు బయటకు వచ్చాయి. ఆమెను సదరు నిందితులు తీవ్రంగా గాయపర్చినట్లు పోస్ట్‌మార్టం నివేదికలో తేలింది. ఈ ఘటనపై కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఆలయ పూజారి, మరో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -