స్వర్గీయ నందమూరి తారకరామారావు 98వ జయంతి నేడు. ఈ సందర్భంగా యావత్ తెలుగు ప్రజానికం ఆయనను స్మరించుకుంటుంది. తెలుగు చిత్ర సీమంలో మకుటం లేని మహరాజుగా వెలిగిపోయిన ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎన్నో సంస్కరణలు తీసుకు వచ్చారు. పేద ప్రజలకు అన్నగా అండదండగా ఉన్నారు. తాజాగా దివంగత వైఎస్సార్ కుమార్తె వైఎస్ షర్మిల కూడా ఎన్టీఆర్ జయంతి సందర్భంగా తన అభిప్రాయాలను పంచుకున్నారు.
మహిళలకు ఆస్తిహక్కు కల్పించిన వ్యక్తి నందమూరి తారకరామారావు అని షర్మిల కీర్తించారు. రెండు రూపాయలకే కిలోబియ్యంతో పేదవాడి ఆకలిని తీర్చిన మహా యుగపురుషుడు.. అంతే కాదు అప్పటి వరకు ప్రజలను పట్టి పీడిస్తున్న పాలకుల గుణం పాఠం నేర్పారు. నాడు పటేల్, పట్వారీ వ్యవస్థలను ఆయన రద్దు చేశారని కొనియాడారు.
బీసీలకు చట్టసభల్లో రాజకీయ అవకాశాలు కల్పించారు. ఆయన జన్మదినం సందర్భంగా వారి సంక్షేమాన్ని గుర్తుచేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు ఓ పత్రికలో సంక్షేమంలో స్వర్ణయుగం అంటూ ఎన్టీఆర్ పై వచ్చిన కథనాన్ని కూడా ఆమె పంచుకున్నారు.
ఆనందయ్య గురించి బాలయ్య ఏమన్నాడంటే..!