Friday, April 19, 2024
- Advertisement -

కరోనాతో ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత

- Advertisement -

దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ మొదలైనప్పటి నుంచి సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇలా పలు ఇండస్ట్రీలో నటులు ఇతర సాంకేతిక వర్గానికి చెందిన వారు కరోనాతో కన్నుమూస్తున్నారు. తాజాగా ప్రముఖ ఓడియా సంగీత దర్శకుడు శాంతిరాజ్ కోశల(53) కరోనాతో మృతి చెందారు.

ఇటీవల అస్వస్థతకు గురైన ఆయన కోవిడ్‌ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. దాంతో ఆయన హూం క్వారంటైన్ లో ఉన్నారు. బుధవారం రాత్రి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తింది. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను కటక్‌లోని ఎస్‌బీబీ హాస్పిటల్‌కు తరలించారు.

అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఆయన తుదిశ్వాస విడిచారు. కోశల మరణం పట్ల ఒడిశాకు చెందిన సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగా శాంతిరాజ్‌ కోశల 20కి పైగా ఒడియా చిత్రాలకు సంగీతం అందించి ప్రశంసలు అందుకున్నారు. అంతేగాక 2వేలకు పైగా ఆయన సొంతంగా ఆల్బమ్స్‌ రూపొందించారు.

ఆనందయ్య గురించి బాలయ్య ఏమన్నాడంటే..!

కళ్యాన్ రామ్ ‘బింబిసార‌’ లుక్ అదుర్స్

ఎన్టీఆర్ పేదల ఆకలి తీర్చిన యుగపురుషుడు : వైఎస్ షర్మిల

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -