Saturday, April 27, 2024
- Advertisement -

టికెట్ల వార్‌..హస్తినకు బీజేపీ లీడర్లు!

- Advertisement -

ఏపీ బీజేపీలో టికెట్‌ వార్ తారస్థాయికి చేరింది. టికెట్లు రాని నేతలు హస్తినబాట పట్టారు. పొత్తులో భాగంగా 10 అసెంబ్లీ, 6 ఎంపీ స్థానాలకు బీజేపీ పోటీ చేస్తుండగా కొన్ని సీట్లపై ఏకాభిప్రాయానికి రాగా మరికొన్ని సీట్లపై పీటమూడి నెలకొంది.

లోక్ సభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. కొత్తపల్లి గీత (అరకు), సీఎం రమేశ్ (అనకాపల్లి), డి. పురందేశ్వరి (రాజమహేంద్రవరం), భూపతిరాజు శ్రీనివాసవర్మ ( నరసాపురం), వరప్రసాద రావు (తిరుపతి), ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి (రాజంపేట)లకు టికెట్లు కేటాయించింది.

జీవీఎల్ నర్సింహారావు , సోము వీర్రాజు టికెట్ ఆశించగా భంగపాటు తప్పలేదు. దీంతో టికెట్లు ఆశించి భంగపడ్డ నేతలు హస్తిన బాట పట్టారు. ఇవాళో,రేపో అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనుండగా అసెంబ్లీ ఎన్నికల్లోనైనా పోటీచేసేందుకు అవకాశం ఇవ్వాలని బీజేపీ సీనియర్ నేతలు కోరనున్నారు. దీంతో జీవీఎల్, సోమువీర్రాజులకు అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం ఉంటుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -