Friday, May 17, 2024
- Advertisement -

జగన్ స్కెచ్‌..పవన్ మైండ్ బ్లాంక్!

- Advertisement -

ఏపీ సార్వత్రిక ఎన్నికలకు టైం దగ్గర పడుతున్న కొద్ది సీఎం జగన్ తనదైన వ్యూహాలతో దూసుకుపోతున్నారు. ప్రధానంగా ఓ వైపు అభివృద్ధి, మరోవైపు ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటన,వైసీపీ చేసిన సంక్షేమం వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే జగన్ ఎప్పుడు ఏం నిర్ణయం తీసుకుంటారో తెలియక టీడీపీ, జనసేన నేతలు షాక్ తింటున్నారు.

తాజాగా కాపు స్కెచ్‌తో ముందుకు వచ్చారు జగన్. కాపు సామాజిక వర్గ నేతలపై దృష్టి సారించిన జగన్ ఇందులో భాగంగా కాపు నేతలు హరిరామజోగయ్య, ముద్రగడ పద్మనాభంపై ప్ర్యేక దృష్టి పెట్టారు. ఇక ఇప్పటికే హరిరామజోగయ్య కుమారుడు సూర్యప్రకాశ్ వైసీపీలో చేరగా ముద్రగడ చేరికకు రంగం సిద్ధమైంది. ఈ నెల 12న ముద్రగడ వైసీపీలో చేరడం దాదాపు ఖాయమైంది.

వైసీపీ కీలక నేత మిథున్ రెడ్డి ఇప్పటికే ముద్రగడతో మాట్లాడగా వైసీపీలో చేరేందుకు సిగ్నల్ ఇచ్చేశారు. ఇక ఈసారి ఎన్నికల్లో ముద్రగడ ఫ్యామిలీ నుండి ఒకరు పోటీ చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోండగా పిఠాపురం అసెంబ్లీ కేటాయించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా జగన్ వేసిన కాపు స్కెచ్‌తో పవన్ అండ్ కోకి మైండ్ బ్లాంక్ అవడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -