Monday, April 29, 2024
- Advertisement -

కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ రిలీజ్..

- Advertisement -

ఏపీ కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ అయింది. 114 అసెంబ్లీ, 5 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్. అంతా ఊహించినట్లుగానే కడప పార్లమెంట్ నుండి పోటీ చేస్తున్నారు షర్మిల. రాజమండ్రి నుండి గిడుగు రుద్రరాజు,కాకినాడ నుంచి పల్లంరాజు, బాపట్ల నుంచి జేడీ శీలం కర్నూల్ నుంచి రామ్ పుల్లయ్య యాదవ్ పేర్లను ప్రకటించారు.

చింతల పూడి కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థిగా ఎలీజా,నందికొట్కూరు కాంగ్రెస్ అభ్యర్థిగా ఆర్థర్ ,పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్‌పై మదేపల్లి సత్యానంద రావు పోటీ చేయనున్నారు. కుప్పంలో చంద్రబాబుపై ఆవుల గోవిందరాజు,రోజాపై పోచారెడ్డి రాకేశ్ రెడ్డిని కాంగ్రెస్ బరిలోకి దింపింది. ఇక శింగనమల నుంచి పీసీసీ మాజీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ పోటీ చేస్తున్నారు. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్‌సభ సీట్లు ఉన్నాయి. మిగతా అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ త్వరలోనే ప్రకటించనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -