సైలెంట్గా ఆపరేషన్ ఆకర్ష్కు శ్రీకారం చుడుతున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ప్రధానంగా బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తూ ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలు,కార్పొరేటర్లను సైలెంట్గా కాంగ్రెస్ వైపుకు తిప్పుకుంటున్నారు. ఇక ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా ఇప్పటివరకు పలు మున్సిపాలిటీలు హస్త గతం కాగా రానున్న రోజుల్లో మరిన్ని మున్సిపాలిటీలు కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లనున్నాయి.
ఇక కాంగ్రెస్లో రోజుకో బీఆర్ఎస్ నేత చేరే పరిస్థితి వచ్చింది. బొంతు నుండి మొదలు పెడితే పట్నం దంపతులు, తీగల కుటుంబం,ఎంపీ నేతకాని వెంకటేష్, వరంగల్ మేయర్ గుండు సుధారాణి వరకు ఒక్కొక్కరుగా పార్టీని వీడగా తాజాగా మరో ఎమ్మెల్యే కేసీఆర్కు షాకిచ్చేందుకు రెడీ అయ్యారు.
తొలి నుండి కాంగ్రెస్లో చేరుతారని ప్రచారం జరుగుతున్న భద్రాచలం ఎమ్మెల్యే తెల్రం వెంకట్రావ్ తాజాగా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. పొంగులేటికి ప్రధాన అనుచరుడిగా ఉన్న వెంకట్రావ్…ఎన్నికలకు ముందు బీఆర్ఎస్లో చేరి విజయం సాధించారు. అప్పట్లోనే ఆయన కాంగ్రెస్లో చేరుతారని ప్రచారం జరిగింది. అయితే తాజాగా సీఎం రేవంత్ని కలవడం ఆయన హస్తం గూటికి చేరడం ఖాయమనే టాక్ నడుస్తోంది. పైకి నియోజకవర్గ అభివృద్ధి కోసమేనని చెబుతున్న కాంగ్రెస్లో చేరికకు ముహుర్తం ఫిక్స్ అయిందని పొలిటికల్ సర్కిల్స్లో టాక్ నడుస్తోంది. ఇదే జరిగితే బీఆర్ఎస్కు షాక్ ల మీద షాక్లు తగిలినట్లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.