వైసీపీ రెబల్ ఎంపీ రఘురామరాజుకు షాకిచ్చింది బీజేపీ అధిష్టానం. వైసీపీ నుండి గెలిచి రెబల్ ఎంపీగా మారి సొంతపార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ఆ తర్వాత టీడీపీ అక్కడి నుండి బీజేపీకి మారి టికెట్ ఆశీంచారు. తనకు ఎంపీ టికెట్ వస్తుందని జగన్పై విమర్శల స్వరం పెంచారు. కానీ సీన్ కట్ చేస్తే తీరా బీజేపీ అధిష్టానం రఘురామరాజుకు హ్యాండ్ ఇచ్చింది.
రఘురామ ప్రాతినిధ్యం వహిస్తున్న నరసాపురం ఎంపీ టికెట్ను శ్రీనివాస వర్మకు కేటాయించింది బీజేపీ. దీంతో బీజేపీ ఆర్ఆర్ఆర్ను ఎందుకు పక్కన పెట్టిందో అని చర్చ జరుగుతుండగా కొంతమంది మాత్రం తగిన శాస్త్రి జరిగిందని అభిప్రాయపడుతున్నారు.
దీంతో రఘురామ ముందున్న ఆప్షన్ ఏంటా అన్న చర్చ జరుగుతోంది. ఈసారి పోటీ కోసం అన్ని సిద్ధం చేసుకున్ నరఘురామ ఇండిపెండెంట్గా పోటీ చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఒకవేళ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలకు దూరం అయ్యే పరిస్థితి నెలకొనడంతో రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది రఘురామ పరిస్థితి.