Friday, May 3, 2024
- Advertisement -

ఎన్నికల సిత్రాలు…

- Advertisement -

ఏపీ పొలిటికల్ వాతావరణం హీటెక్కింది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాకముందే అప్పుడే పొలిటికల్ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ ఇప్పటికే పిఠాపురం నుండి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించగా ముఖ్య నేతలు సైతం ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు.

ఆర్టీసీ బస్సులో మంత్రి అంబటి రాంబాబు ప్రయాణించగా ఆటోలో పవన్ కల్యాణ్, ఇస్త్రీ చేసి ప్రజలను ఓట్లు అడిగారు మాజీ జేడీ లక్ష్మీ నారాయణ. ఇక పవన్ ఇవాళ ఉదయం ఓ దుకాణంలో టీ తయారు చేశారు. జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు మాజీ జేడీ లక్ష్మీ నారాయణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలను కలిశారు. ఓ ప్రాంతంలో ఇస్త్రీ చేశారు.

ఆర్టీసీ బస్సు ఎక్కి ఎన్నికల ప్రచారం నిర్వహించారు మంత్రి అంబటి. సత్తెనపల్లి పట్టణంలో బస్సులో వైసీపీ ఎన్నికల కరపత్రాలు పంచారు. తమ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల గురించి వివరించి చెప్పారు. ఇక పవన్‌ నవారు మంచంపై కూర్చొని ప్రజలతో ముచ్చటించారు. ఓ పాపను ఎత్తుకుని ఆడించారు.ఎన్నికల వేళ ఇలాంటి సిత్రాలు మాములే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -