- Advertisement -
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోనుందా?అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రెండు రోజులుగా మాజీ మంత్రి మల్లారెడ్డి,ఆయన అల్లుడు, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కాలేజీల్లో అక్రమ నిర్మాణాలను అధికారులు కూలగొడుతున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో వీరిద్దరూ కాంగ్రెస్లో చేరుతారని ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలకు నిజం చేకూరేలా సీఎం రేవంత్ రెడ్డి సలహాదారు వేంనరేందర్ రెడ్డితో భేటీ అయ్యారు మల్లారెడ్డి. ఈ సందర్భంగా కాంగ్రెస్లో చేరికపై క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. మల్కాజిగిరి ఎంపీ స్థానం నుండి పోటీ చేయడం లేదని, ఆ ఆలోచన లేదని మల్లారెడ్డి చెప్పడం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది.
మామ,అల్లుళ్లు కాంగ్రెస్లో చేరికపై ప్రచారాన్ని ఖండించలేదు. ఒకవేళ మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి కారు దిగి కాంగ్రెస్లో చేరితే బీఆర్ఎస్కు పెద్ద మైనస్ కానుంది.