Monday, May 6, 2024
- Advertisement -

ఉచిత టీ..పవన్‌ ప్రచారం షురూ!

- Advertisement -

ఛాయ్ వాలా..అంటే గుర్తుకొచ్చేది మోడీ, బీజేపీ. చాయ్‌వాలాగా తనను తాను ప్రమోగం చేసుకున్న మోడీ మంచి ప్రాచుర్యం పొందారు. తర్వాత ఛాయ్ పే చర్చా కార్యక్రమాన్ని తీసుకొచ్చి లబ్ది పొందింది బీజేపీ. ఇప్పుడు ఇదే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు జనసేన నేతలు. తాడేపల్లిగూడెంలో జనసేన ఎన్నికల ప్రచార గుర్తును విస్తృతంగా ప్రచారం చేసేందుకు గాజు గ్లాస్ లో ఉచితంగా టీ పంపిణీ చేస్తున్నారు జనసేన నేతలు.

ఇందుకోసం ఉచిత టీస్టాల్స్ ని కూడా ఏర్పాటు చేశారు. ఈ వెరైటీ ప్రమోషన్ ద్వారా ఒకటి ప్రజలకు ఉచితంగా టీ అందించడంతో పాటు జనాల్లోకి తమ పార్టీ గుర్తును తీసుకెళ్లినట్లు కూడా ఉంటుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

అయితే జనసేన నేతలు ఉచిత టీని పంపిణీ చేయడం ఇది కొత్తేమీ కాదు. 2019 ఎన్నికలకు ముందు కూడా ఆ పార్టీ నేతలు కాకినాడలో ఇదే కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే ఎన్నికల ప్రచార గుర్తు సంగతేమో కానీ ఫస్ట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -