Sunday, May 19, 2024
- Advertisement -

బర్రెలక్కకు మద్దతుగా జేడీ!

- Advertisement -

సోషల్ మీడియా సంచలనం బర్రెలక్క. కొల్లాపూర్ నుండి స్వతంత్య్ర అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసిన బర్రెలక్క అలియాస్ శిరీషకు విజిల్ గుర్తు వచ్చింది. ఇక నామినేషన్ల ఉపసంహరణ పూర్తి కాగా ప్రచారాన్ని మొదలు పెట్టగా ఆమెపై దాడి జరిగింది. దీంతో ఆమె ప్రజల మద్దతు వెల్లువలా రాగా ఎన్నారైలు సైతం ఆమెకు మద్దతుగా ప్రచారాన్ని నిర్వహించేందుకు ముందుకొచ్చారు.

తాజాగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ… బర్రెలక్క శిరీష తరఫున ప్రచారం నిర్వహించారు. కొల్లాపూర్‌కు వచ్చి శిరీషను కలిసిన జేడీ…సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఇలాంటి యువత రాజకీయాల్లోకి రావాలని…శిరీష ఎమ్మెల్యే అయితే మొదట ఆనందపడేది తానే అన్నారు. ఇలాంటి వాళ్లు ఎందరికో రోల్ మోడల్ అవుతారన్నారు.

శిరీష ఈ స్థాయికి రావడానికి కారణం సోషల్ మీడియా అని, కాబట్టి దానిని మనం సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని సూచించారు. యానాం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మల్లాడి కృష్ణారావు శిరీషకు మద్దతుగా ఇక్కడికి వస్తున్నారన్నారు. ఇక సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారిన శిరీషకు పెద్ద ఎత్తున మద్దతు వస్తుండగా ఆమె చట్టసభల్లో అడుగు పెడుతుందో వేచిచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -