Friday, May 10, 2024
- Advertisement -

అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ..బాండ్ పేపర్‌పై రాసిస్తా!

- Advertisement -

ఇప్పటివరకు రాజకీయాల్లో గెలిస్తే తాము ఏం చేస్తామో ప్రజలకు బాండ్ పేపర్ రాసిచ్చిన వారిని చూశాం..కానీ బహుశా ఇదే తొలిసారేమో. ఓ నాయకుడికి ఎమ్మెల్సీ ఇస్తానని బాండ్ పేపర్ రాసిస్తానని మరో నాయకుడు చెప్పడం. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఆ టీడీపీ నేత చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇంతకీ ఎవరా నాయుడు..?ఎక్కడ జరిగింది ఇదనుకుంటున్నారా?.

గుడివాడ అనగానే గుర్తొచ్చేది కొడాలి నాని. టీడీపీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు నాని. ముఖ్యంగా నాని టార్గెట్ చంద్రబాబు, లోకేష్‌ ఇద్దరే.ఏ ప్రెస్ మీట్ పెట్టిన వీరిద్దరిని చీల్చిచెండాడడమే నాని పని. ఇక ఆయన మాట్లాడే మాటలు కూడా అంత పదునుగా ఉంటాయి. అందుకే ఈసారి ఆయన్ని ఓడించేందుకు పావులు కదుపుతోంది టీడీపీ.

ఇందులో భాగంగా టీడీపీ గుడివాడం ఇంచారజీగా వెనిగండ్ల రామును నియమించారు. అయితే ఇంతవరకు బాగానే ఉన్న అప్పటివరకు టికెట్ ఆశించిన సీనియర్ నేత రావి వెంకటేశ్వరరావు వర్గం ఒక్కసారిగా భగ్గుమంది. దీంతో వీరిద్దరిని సమన్వయ పరిచే బాధ్యత మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు అప్పగించారు చంద్రబాబు. దీంతో రంగంలోకి దిగిన రవీంద్ర సమన్వయ సమావేశం ఏర్పాటు చేయగా రావి వర్గీయులు రవీంద్రను నిలదీశారు. ప్రతీ సారి వెంకటేశ్వరరావుకు అన్యాయమే జరుగుతోందని పెద్ద ఎత్తున నినాదాలు చేయగా…రావిని చంద్రబాబు ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. అయితే కార్యకర్తలు శాంతించ లేదు. దీంతో అవసరమైతే బాండ్ పేపర్‌పై రావికి ఎమ్మెల్సీ ఇస్తానని రాసిస్తానని…ఒకవేళ అన్యాయం జరిగితే నేను రాజీనామా చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఇదే ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -