Tuesday, April 30, 2024
- Advertisement -

లోకేష్ యువగళం…ఈసారైన కంటిన్యూ చేస్తారా?

- Advertisement -

టీడీపీ నేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభమైంది. చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఎక్కడైతే బ్రేక్ ఇచ్చాడు అక్కడి నుండే తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం పొదలాడ నుండే యాత్ర ప్రారంభించారు. లోకేష్ కు మద్దతుగా పాదయాత్రలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు.

పొదలాడ నుండి యాత్ర ప్రారంభం కాగా తాటిపాకలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. అక్కడి నుండి పి.గన్నవరం,మామిడికుదురు,అమలాపురంలో తొలిరోజు యాత్ర సాగనుంది. ఇప్పటి వరకు 209 రోజులపాటు 2852.4 కిలో మీటర్ల మేర లోకేష్ పాదయాత్ర సాగగా బ్రేక్ ఇచ్చిన రెండు నెలల తర్వాత యాత్రను ప్రారంభించారు.

అయితే ఈ యాత్ర తొలుత అనుకున్న టైం కంటే ముందుగానే ముగియనున్నట్లు తెలుస్తోంది. తొలి విడత యువగళం యాత్రకు స్పందన నామమాత్రంగానే రాగానే ఈసారి అన్ని అంశాలను పరిశీలించాకే యాత్ర ప్రారంబించారు లోకేష్. మరి ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుందో చూడాల్సి ఉండగా ఈ సారైన యాత్రను కంటిన్యూ చేస్తారా అన్నది లేదా సందేహం అందరిలో నెలకొంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -