ఎన్నికల వేళ వైసీపీలోకి చేరికల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే జనసేన నుండి పెద్ద ఎత్తున నేతలు వైసీపీ గూటికి చేరిపోగా తాజాగా మరో కీలక నేత చేరికకు రంగం సిద్ధమైంది.జనసేన ముమ్మిడివరం కో ఆర్డినేటర్ పితాని బాలకృష్ణ వైసీపీలో చేరికకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.
2019లో ముమ్మిడివరం నుండి పోటీ చేశారు పితాని బాలకృష్ణ. వైసీపీ నుండి టికెట్ రాకపోవడంతో గత ఎన్నికల్లో జనసేనలో చేరగా పితానిని తొలి అభ్యర్థిగా ప్రకటించారు పవన్. అయితే జగన్ సునామీలో పితానికి ఓటమి తప్పలేదు.
ఇక పవన్ తీరును నిరసిస్తూ పార్టీ మారేందుకు రెడీ అయ్యారు బాలకృష్ణ.శెట్టిబలిజలకు ఒక్క సీటు కూడా పవన్ ఇవ్వలేదని..మాట్లాడటానికి కనీసం అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని మండిపడ్డారు. ముమ్మిడివరం సీటును ఆశీంచారు బాలకృష్ణ. పొత్తులో భాగంగా ఈ సీటు టీడీపీకి వెళ్లగా రామచంద్రపురం సీటును ఆశీంచారు.కానీ అక్కడ టికెట్ దక్కకపోవడంతో పార్టీ మారేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే పవన్, జనసేనకు బిగ్ షాకేనని అభిప్రాయం వ్యక్తమవుతోంది.