ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారమవుతున్న అతిపెద్ద రియాలిటీ షోలలో “బిగ్ బాస్” మంచి ప్రేక్షకాదరణ పొందింది. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ రియాలిటీ షో ను తెలుగు, హిందీ ,కన్నడ, తమిళ, మలయాళం భాషలలో ప్రసారం ప్రసారం చేయడం జరుగుతోంది. బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొన్న కంటెస్టెంట్లలో చాలామంది మంచి క్రేజ్ తెచ్చుకుని ఇండస్ట్రీలో సెటిల్ అవుతున్నారు.
ప్రస్తుతం మలయాళంలో బిగ్ బాస్ సీజన్ త్రీ నడుస్తోంది. దీనికి ప్రముఖ నటుడు మోహన్ లాల్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో దేశమంతా లాక్డౌన్ విధించారు. ఇందులో భాగంగా సినిమా, టీవీ షూటింగ్స్ పైనా ఆంక్షలున్నాయి. ఐనప్పటికీ బిగ్ బాస్ నిర్వాహకులు మాత్రం ఇవేవీ లెక్క చేయకుండా
మలయాళీ బిగ్ బాస్ షో షూటింగ్ను అలాగే కొనసాగిస్తున్నారు.
Also read:కరోనా బాధితుల కోసం ముందుకొచ్చిన యాంకర్ వింధ్య.. ఎలా అంటే?
ఇటీవలే బిగ్ బాస్ సెట్లో పనిచేసే 8 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు బిగ్ బాస్ షూటింగ్ను లిపివేశారు. కంటెస్టంట్స్తో పాటు కెమెరామెన్స్, టెక్నీషియన్స్, ఇతర సిబ్బందిని సెట్ నుంచి బయటకు పంపి అనంతరం సీల్ వేశారు. అయినను బిగ్ బాస్ నిర్వాహకులు మాత్రం జూన్ 4న గ్రాండ్ ఫినాలే యథావిధిగా జరుగుతుందని చెప్పడం పలువురికి ఆశ్చర్యం కలిగిస్తోంది.
Also read:నాగార్జున, కోదండరామిరెడ్డి కాంబో సక్సెస్ ఫుల్ సినిమాలు?