Monday, April 29, 2024
- Advertisement -

కరోనా బాధితుల కోసం ముందుకొచ్చిన యాంకర్ వింధ్య.. ఎలా అంటే?

- Advertisement -

దేశవ్యాప్తంగా కరోనా ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో రోజు రోజుకి కేసుల సంఖ్య అధికమవుతోంది. ఈ క్రమంలోనే ఎంతోమంది సరైన సమయంలో వైద్యం అందక మృత్యువాత పడుతున్నారు.ఇటువంటి క్లిష్టమైన పరిస్థితులలో ఎంతో మంది ముందుకు వచ్చి తమకు తోచిన విధంగా సహాయం చేస్తున్నారు.ఇక బాలీవుడ్ నటుడు సోనూసూద్ కరోనా బాధితులని ఏవిధంగా ఆదుకుంటున్నారు మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే నటుడు సోను సూద్ కరోనా బాధితుల కోసం సొంత డబ్బులతో ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. పౌండేషన్ ద్వారా కరోనా బాధితులకు మందులు ఆక్సిజన్ పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ పౌండేషన్ కి పలువురు సెలబ్రిటీలు పెద్దఎత్తున విరాళంగా ఇస్తున్నారు.తాజాగా యాంకర్‌, ఐపీఎల్‌ స్టార్‌ స్పోర్ట్స్‌ తెలుగు హోస్ట్‌ వింధ్య సైతం సరికొత్త ఆలోచనతో ముందుకు వచ్చాడు.

Also read:సాయి పల్లవి ఒక్క సినిమాకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుందో తెలుసా?

కరోనా బాధితులకు సహాయం చేయడం కోసం యాంకర్ వింధ్య తన దగ్గర ఉన్నటువంటి బట్టలను వేలం వేసి వచ్చిన డబ్బును సోను సూద్ ఫౌండేషన్ విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు. ఈ వీడియో చూసిన యాంకర్ అనసూయ ఇది నిజంగానే అద్భుతమైన ఆలోచన ఈ వీడియో నాలో ఎంతో స్ఫూర్తిని నింపింది. నేను కూడా ఇలాగే చేస్తానని చెప్పడంతో అందుకు స్పందించిన వింద్య థాంక్యూ అనూ అంటూ స్పందించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also read:ఓటీటీలో విడుదల కానున్న అఖిల్ సినిమా.. నాగార్జున షాకింగ్ నిర్ణయం?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -